మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చేదు అనుభవం

మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చేదు అనుభవం

పెద్దపల్లి జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కు చేదు అనుభవం ఎదురైంది. ధర్మారం మండలం బొట్లవనపర్తిలో రైతువేదిక ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్  ముందే సర్పంచ్,ఉప సర్పంచ్ లు నిరసన తెలిపారు.  రైతు ప్రారంభోత్సవానికి తమకు సమాచారం ఇవ్వలేదని, ప్రొటోకాల్ పాటించలేదని ఆందోళనకు దిగారు. దీంతో  మంత్రి కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్తున్న సర్పంచ్, ఉప సర్పంచ్ ని బుజ్జగించి కార్యక్రమాన్నినిర్వహించారు అధికార పార్టీ నేతలు. గ్రామ పాలక వర్గానికి కనీస మర్యాద పాటించకపోవడంపై స్థానికులు కూడా అసహనం వ్యక్తం చేశారు.