
ఇండియన్ లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ' భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా పొన్నియన్ సెల్వన్'. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ చారిత్రక చిత్రం, రాజరాజ చోళ పాలనా కాలంలో సాగుతుంది. ఈ మూవీ రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పీఎస్-1 గా సెప్టెంబర్ 30వ తేదీన తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మొదటి భాగం విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు తెలుగు టీజర్ ను సూపర్ స్టార్ మహేశ్ బాబు వదిలారు.
ఈ సినిమా విజువల్ వండర్గా రూపొందినట్టు టీజర్ను చూస్తే తెలుస్తోంది. భారీ స్థాయిలో చిత్రీకరించిన పోరాటలు అభిమానులను అలరిస్తున్నాయి. అలాగే కథలోని కొన్ని సున్నితమైన అంశాలను డైలాగ్స్ లేకుండా టచ్ చేశారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలిచేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య లక్ష్మి, త్రిష ప్రధానమైన పాత్రలను పోషించారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రసిద్ధ రచయిత కల్కి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.