డిగ్రీ చదువుతోన్న విద్యార్థి
పబ్జీ గేమ్కు బానిసై ఓ స్టూడెంట్సూసైడ్ చేసుకున్నాడు. హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎల్లారెడ్డిగూడకు చెందిన అఖిల్ ( 21) డిగ్రీ చదువుతున్నాడు. మూడు నెలలుగా కాలేజీకి వెళ్లకుండా పబ్జీ గేమ్కు బానిసయ్యాడు. 2018లో అఖిల్ నాన్న చనిపోవడంతో అమ్మతో కలిసి ఎల్లారెడ్డిగూడలో నివాసం ఉంటున్నాడు.
బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని తల్లి జయ బయటకు వెళ్లి వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉంది. వాచ్ మ్యా న్ సహాయంతో డోర్ బద్దలు కొట్టగా లోపల ఉరివేసుకున్న కొడుకు కనిపించాడు. వెంటనే నిమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.