రూ.1800 కోట్ల భూమి రూ.300 కోట్లకే?..పూణేలో భారీ ల్యాండ్ డీల్ వివాదం..మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం

రూ.1800 కోట్ల భూమి రూ.300 కోట్లకే?..పూణేలో భారీ ల్యాండ్ డీల్ వివాదం..మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం

పూణేలో భారీ ల్యాండ్ డీల్ వివాదం మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. డిప్యూటీ సీఎం అజిత్​ పవార్​ కొడుకు పక్త్​ పవార్​ కు చెందిన కంపెనీకీ కోట్ల రూపాయల విలువైన భూమిని అప్పనంగా  కట్టబెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్​ విలువ కంటే చాలా తక్కువ ధరలకు భూమిని పక్త్​ పవార్​ కంపెనీకి ఇచ్చారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. 

పూణేలో దాదాపు రూ.1800 కోట్ల విలువైన 40 ఎకరాల భూమిని పార్థ్ పవార్ కంపెనీకి దాదాపు రూ.300 కోట్లకు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఒప్పందంపై చెల్లించిన స్టాంప్ డ్యూటీ రూ.500 మాత్రమే కావడం చాలా మందిని మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వివాదం రాజకీయంగా తీవ్ర కలకలం రేపడంతో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్​ కూడా చర్యలకు ఆదేశించారు. ఈ వివాదంలో ఫుణె ఎమ్మార్వో సూర్యకాంత్​ యోవాలెను సస్పెండ్ చేశారు. అదనపు సీఎస్​ వికాస్​ ఖర్గే అధ్యక్షతన విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తప్పు జరిగిందని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామనిఅన్నారు. 

ఏం జరిగింది.. ?

స్టాంపులు ,రిజిస్ట్రేషన్ శాఖ ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. భూమి లావాదేవీ పూర్తిగా చట్టవిరుద్ధంగా జరిగినట్లు తెలుస్తోంతి. వాస్తవ ఆస్తి ధరను చాలా తక్కువగా అంచనా వేసిన కేవలం రూ. 500 స్టాంప్ పేపర్‌పై అమ్మకం జరిగిందని దర్యాప్తులో తేలింది. ఈ వివాదం తర్వాత పూణే డిప్యూటీ రిజిస్ట్రార్ రవీంద్ర తరును కూడా సస్పెండ్ చేశారు. లావాదేవీని చట్టవిరుద్ధంగా నమోదు చేశారని, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారని అసలు భూ యజమానికి,రాష్ట్ర ఖజానాకు నష్టాన్ని కలిగించారని పార్థ పవార్​ పై ఆరోపణలు చేశారు.

వివాదంలో ఉన్న భూమి పూణేలోని కోరెగావ్ పార్క్‌లో ఉంది..ఇది నగరంలోని అత్యంత విలువైన,హైలెవెల్​ప్రాంతాలలో ఒకటి. ప్రభుత్వ అనుమతులు లేకుండా, నిబంధనలు ఉల్లంఘించి లావాదేవీలు జరిగాయని అధికారులు చెబుతున్నారు. ట్యాక్స్​,స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టేందుకు ఆస్తిని విలువ తక్కువ అంచనా వేయడానికి బిగ్​ ల్యాండ్​ డీల్​ జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.