
- ఈ నెల 30 వరకు లాక్డౌన్ పొడిగింపు
చండీగఢ్: కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్న వేళ పంజాబ్ కూడా కీలకమైన నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ను ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఒడిశా తర్వాత లాక్డౌన్ కొనసాగిస్తున్న రాష్ట్రం పంజాబ్. రాష్ట్రంలో ఇప్పటి వరకు 132 కేసులు నమోదు కాగా.. 11 మంది చనిపోయారు.