ప్రభ‌సిమ్రాన్ సింగ్ సెంచరీ.. పంజాబ్ భారీ స్కోరు

ప్రభ‌సిమ్రాన్ సింగ్ సెంచరీ.. పంజాబ్ భారీ స్కోరు

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ టీమ్ 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.  పంజాబ్ కింగ్స్  ఓపెనర్ ప్రభ‌సిమ్రాన్ సింగ్ సెంచరీతో చెలరేగాడు.  ప్రభసిమ్రాన్ సింగ్ కేవలం 65 బంతుల్లోనే 10 ఫోర్లు,  6 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. 

మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (7) రెండో ఓవర్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన లియామ్ లివింగ్‌స్టోన్ (4) కూడా ఇషాంత్‌ బౌలింగ్ లోనే వెనుదిరిగాడు. జితేశ్ శర్మ(5) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు.  దీంతో పంజాబ్  45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 

 ఈ సమయంలో  సామ్ కరన్ (20) తో కలిసి ప్రభసిమ్రాన్ సింగ్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌ కెరీర్‌లో మొదటి సెంచరీ నమోదు చేశాడు.  చివర్లో షారూక్ ఖాన్ (2), సికిందర్ రజా (11) విఫలమవడంతో పంజాబ్ 167 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ రెండు, అక్షర్ పటేల్, ప్రవీణ్ దూబె, కుల్దీప్ యాదవ్, ముకే‌ష్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.