పంజాబ్ బ్యాటర్లు విఫలం..గుజరాత్కు స్వల్ప టార్గెట్

పంజాబ్ బ్యాటర్లు విఫలం..గుజరాత్కు స్వల్ప టార్గెట్

 గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ లో విఫలమైంది. గుజరాత్ బౌలర్ల ధాటికి కేవలం  20 ఓవర్లలో 8వికెట్లకు 153 పరుగులే చేసింది.  ఆ జట్టులో మాట్ షార్ట్ చేసిన 36 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. 

టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ కింగ్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఖాతో ఓపెన్ కాకముందే తొలి వికెట్ కోల్పోయింది.  ప్రభ్ సిమ్రాన్ సింగ్ ను షమీ డకౌట్ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ ధావన్ (8) రెండో వికెట్ గా వెనుదిరిగాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మాట్ షార్ట్(36), బానుక రాజపక్స(20) జట్టును ఆదుకున్నారు. ముఖ్య మాట్ షార్ట్ 24 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సుతో చెలరేగాడు. అయితే మాట్ షార్ట్ (36)ను రషీద్ ఖాన్ పెవలియన్ చేర్చాడు. దీంతో పంజాబ్ 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 

జితేష్ శర్మ పోరాటం..

రాజపక్సకు జతకలిసిన జితేష్ శర్మ..బ్యాట్ ఝుళిపించాడు. వీరిద్దరు నాల్గో వికెట్ కు 36 పరుగులు జత చేశారు. అయితే 25 పరుగులు చేసిన జితేష్ శర్మ మోహిత్ శర్మ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సామ్ కర్రన్ (22), షారుక్ ఖాన్ (22) పరుగులతో రాణించడంతో పంజాబ్ మోస్తరు స్కోరు సాధించింది. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 2 వికెట్లు దక్కించుకున్నాడు. షమీ, జాషువా లిటిల్, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్ తలా ఓ వికెట్ పడగొట్టారు.