పంజాబ్ లో దారుణం జరిగింది. ఓ కాలేజీలో క్లాస్ రూమ్ లో అందరు చూస్తుండగానే అమ్మాయిని గన్ తో కాల్చి చంపేసి.. తర్వాత తనను తానే షూట్ చేసుకున్నాడు ఓ స్టూడెంట్. సోమవారం ( ఫిబ్రవరి 9 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... పంజాబ్ లోని తర్న్ తరన్ జిల్లాలో జరిగింది ఈ దారుణం. జిల్లాలోని ఉస్మాలో ఉన్న మై భాగో లా కాలేజీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ తన తోటి స్టూడెంట్ ని కాల్చి చంపి, ఆ తర్వాత అదే గన్ తో తనను తాను కాల్చుకొని చనిపోయాడు.
మల్లియన్ గ్రామానికి చెందిన ప్రిన్స్ రాజ్ అనే స్టూడెంట్ నౌషెహ్రా పన్నువాన్కు చెందిన సందీప్ కౌర్ అనే అమ్మాయిని గన్ తో కాల్చి చంపేశాడు. ఇవాళ ఉదయం 9:16 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో సందీప్ కౌర్ అక్కడికక్కడే మరణించగా, ప్రిన్స్ రాజ్ కూడా చనిపోయినట్లుతెలిపారు పోలీసులు. ప్రిన్స్ కౌర్ను ఎందుకు చంపాడనేది ఇంకా తెలియలేదు, అయితే దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
पंजाब के तरनतारन में लॉ स्टूडेंट ने कक्षा में घुसकर छात्रा को गोली मारी, फिर खुद को भी गोली मार ली, दोनों की मौत, प्रारंभिक जांच में सामने आ रहा है कि छात्रा ने प्रपोज से इनकार कर दिया।@PunjabPoliceInd #punjab @BhagwantMann @TarnTaranPolice #TarnTaran #CampusViolence pic.twitter.com/y4VLmOC5jf
— Democratic Bharat (@Democratic67281) February 9, 2026
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఘటనాస్థలంలో గన్, బుల్లెట్ షెల్స్, ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఫోరెన్సిక్ టీం కూడా ఆధారాలు సేకరిస్తోంది. ఈ క్రమంలో కాలేజీని సీజ్ చేశారు పోలీసులు. ఈ ఘటన కారణంగా కాలేజీలో ఉద్రిక్తత నెలకొంది.
తమ పిల్లలకు కాలేజీలో భద్రత లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. ఒక స్టూడెంట్ గన్ తీసుకొని లోపలి వస్తోంటే కనీసం తనిఖీ కూడా చేయరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి కాలేజీ మేనేజ్మెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పేరెంట్స్.
