
పంజాబీ సింగర్ దలేర్ మెహందీకి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తున్నట్లు పాటియాలా కోర్టు గురువారం ప్రకటించింది. 2003 నాటి మానవ అక్రమ రవాణా కేసులో ఈ శిక్ష పడింది. 2003లో దలేర్ మెహందీ, అతని సోదరుడు షంషేర్ సింగ్పై మానవ అక్రమ రవాణా ఆరోపణలు వచ్చాయి. 1998, 1999 సంవత్సరాలలో వీరిద్దరూ దాదాపు పది మందిని అక్రమంగా అమెరికాలో వదిలేశారని, ఇందుకోసం వారు భారీగా డబ్బులు అందుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో దలేర్ కు వ్యతిరేకంగా 35 కేసులు నమోదయ్యాయి. దీనిపైన విచారణ చేపట్టిన పాటియాలా కోర్టు 2018లో దలేర్ మెహందీకి రెండేళ్ల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా కూడా విధించింది.
బెయిల్పై బయటకు వచ్చి..
ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన ఆయన.. తనకు విధించిన శిక్షను జిల్లా కోర్టులో సవాల్ చేశారు. దీనిపైన విచారణ జరిపిన కోర్టు దలేర్ మెహందీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. కాగా , దలేర్ మెహందీ సోదరుడు షంషేర్ సింగ్ 2017లో మృతి చెందాడు. అటు బాలీవుడ్ లో దలేర్ మెహందీకి మంచి క్రేజ్ ఉంది. ‘బోలో తరా రా రా’ పాటతో ఎక్కుగా పాపులర్ అయ్యాడు. తెలుగులో బాహుబలి, యమదొంగ, బాద్షా, అరవింద సమేత వీరరాఘవ సినిమాలలో పాటలు పాడాడు.