పూరీ జగన్నాథ్ ఆలయం మూడు రోజుల పాటు మూసివేత

పూరీ జగన్నాథ్ ఆలయం మూడు రోజుల పాటు మూసివేత

ప్రఖ్యాత పూరీ జగన్నాథ్ ఆలయం మూడు రోజుల పాటు మూతపడనుంది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. ఈ మూడు రోజులు భక్తులను అనుమతించబోమని ఆలయ అధికారులు తెలిపారు. న్యూ ఇయర్  సందర్భంగా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని.. దీంతో  కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయన్నారు. దీంతో  ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ విషయాన్ని భక్తులందరూ గుర్తించాలని, ఆ మూడు రోజుల పాటు ఎవరూ గుడికి రావద్దని కోరారు. అయితే స్వామివారికి యథావిధిగా అన్ని పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు ఆలయాధికారులు.