ఆసియా టీమ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ బరిలో సింధు

ఆసియా టీమ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ బరిలో సింధు

న్యూఢిల్లీ: మోకాలి గాయం నుంచి కోలుకున్న  స్టార్‌‌‌‌‌‌‌‌ షట్లర్‌‌‌‌‌‌‌‌ పీవీ సింధు మళ్లీ రాకెట్‌‌‌‌‌‌‌‌ పట్టేందుకు రెడీ అయ్యింది. వచ్చే నెల 13 నుంచి 19 వరకు మలేసియాలో జరిగి బ్యాడ్మింటన్‌‌‌‌‌‌‌‌ ఆసియా టీమ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ (బీఏటీసీ)లో బరిలోకి దిగనుంది. ఈ మేరకు టోర్నీలో పాల్గొనే ఇండియా మెన్స్‌‌‌‌‌‌‌‌, విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్స్‌‌‌‌‌‌‌‌ను మంగళవారం ప్రకటించారు. పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌ క్వాలిఫికేషన్‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో ఇండియా షట్లర్లకు ఈ టోర్నీ కీలకం కానుంది. 

మెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌: ప్రణయ్‌‌‌‌‌‌‌‌, లక్ష్యసేన్‌‌‌‌‌‌‌‌, కిడాంబి శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌, చిరాగ్‌‌‌‌‌‌‌‌ సెన్‌‌‌‌‌‌‌‌, సాత్విక్‌‌‌‌‌‌‌‌సాయిరాజ్‌‌‌‌‌‌‌‌, చిరాగ్‌‌‌‌‌‌‌‌ షెట్టి, ధ్రువ్‌‌‌‌‌‌‌‌ కపిల, ఎం.ఆర్‌‌‌‌‌‌‌‌. అర్జున్‌‌‌‌‌‌‌‌, సురజ్‌‌‌‌‌‌‌‌ గోయలా, పృథ్వీ రాయ్‌‌‌‌‌‌‌‌. 
విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌: పీవీ సింధు, అన్మోల్‌‌‌‌‌‌‌‌ కార్బ్‌‌‌‌‌‌‌‌, తన్వీ శర్మ, అష్మితా చాలిహా, ట్రీసా జాలీ, పుల్లెల గాయత్రి, అశ్విని పొన్నప్ప, తనీషా క్రాస్టో, ప్రియా దేవి, శ్రుతి మిశ్రా.