
భారత షట్లర్ పీవీ సింధు స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో ఓటమిపాలైంది. ఇండోనేషియాకు చెందిన గ్రెగోరియా మరిస్కా టుంజంగ్ చేతిలో 8-21 8-21 తేడాతో ఓడిపోయింది. గ్రెగోరియా కేవలం 29 నిమిషాల్లోనే సింధూని చిత్తుగా ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. తుంజంగ్ అంతకుముందు రియో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత కావడం గమనార్హం.. కాగా ఈ ఏడాది సింధు ఓ టోర్నీలో ఫైనల్ కు చేరుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.