టోక్యో: షట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్లో శుభారంభాన్ని ప్రారంభించింది. గ్రూప్ జె తొలిమ్యాచ్లో సింధు విజయం సాధించింది. ఇజ్రాయెల్ ప్లేయర్ క్సేనియా పోలికార్పోవాను ఓడించింది. దాంతో సింధు తర్వాత మ్యాచులలో కూడా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది.
ముసాషినో ఫారెస్ట్ ప్లాజా కోర్ట్ 2లో జరిగిన గ్రూప్ జె మ్యాచ్లో ఇజ్రాయెల్కు చెందిన క్సేనియా పోలికార్పోవాను 21-7, 21-10 తేడాతో ఓడించి షట్లర్ పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్లో తన విజయ యాత్రను ప్రారంభించింది. ఈ మ్యాచ్ కేవలం 28 నిమిషాలలోనే పూర్తవడం గమనార్హం. ఈ గేమ్లో సింధు తన షాట్లతో ప్రత్యర్థిని ఊపిరి తీసుకోకుండా చేసింది.