హైదరాబాద్ లో సింధుకు ఘన స్వాగతం

హైదరాబాద్ లో సింధుకు ఘన స్వాగతం

హైదరాబాద్ : వరల్డ్ చాంపియన్‌ షిప్‌ లో గోల్డ్ మెడల్ గెలిచిన భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు హైదరాబాద్ చేరుకుంది. ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చిన సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్ కు ఘనస్వాగతం పలికారు అభిమానులు. క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీ దినకరన్‌ బాబు తదితరులు సింధును సన్మానించారు. మంగళవారం ఉదయం ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన సింధు.. రాత్రి హైదరాబాద్ కు వచ్చింది.

వరల్డ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ టైటిల్‌ గెలుచుకుని సింధు చరిత్ర సృష్టించింది. జపాన్‌ క్రీడాకారిణి ఒకుహరతో జరిగిన ఫైనల్‌ లో 21-7, 21-7 తేడాతో రెండు వరుస సెట్లలో పూర్తి లీడ్ తో అదరగొట్టి టైటిల్‌ ను తన ఖాతాలో వేసుకుంది.