
- ఆయన బతికుంటే ఏపీ ముఖచిత్రం మారేది
హైదరాబాద్, వెలుగు: వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజా నాయకుడని, ఎల్లప్పుడూ ప్రజల కోసమే బతికిన నేత అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం మాజీ సీఎం వైఎస్సార్ 75వ జయంతి సందర్భంగా రాహుల్ గాంధీ ఆయనకు నివాళులు అర్పిస్తూ, వీడియో సందేశం విడుదల చేశారు. ఆయన మరణం అత్యంత విషాదమని, వైఎస్ బతికి ఉంటే ఏపీకి ఈ పరిస్థితి ఉండేది కాదని, ఆ రాష్ట్రం ముఖ చిత్రమే మారేదన్నారు. వైఎస్ వారసత్వాన్ని ఆయన కూతురు షర్మిల ముందుకు తీసుకెళుతుందన్న నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. ఆమె నాయకత్వంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.