కొత్తగూడెం మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలోని 20 రోజులుగా నీళ్లు బంద్

 కొత్తగూడెం మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలోని 20 రోజులుగా  నీళ్లు బంద్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని పాల్వంచ పట్టణం రాహూల్​గాంధీ నగర్​లో 20 రోజులుగా నీళ్లు రావడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. పైప్​లైన్లు పగిలి నీళ్లన్నీ వృథాగా పోతున్నా కార్పొరేషన్​ అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. 

ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తాగునీటితో పాటు ఇంటి అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు. ఎమ్మెల్యేతో పాటు మేయర్​ స్పందించి నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరారు.