కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేయబోయే భారత్ న్యాయ యాత్ర పేరులో స్వల్ప మార్పు జరిగింది. ఈ పాదయాత్రను భారత్ జోడో న్యాయ యాత్రగా మార్చారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ గురువారం వెల్లడించారు. అయితే, తొలి దశలో జరిగిన భారత్ జోడో యాత్ర పూర్తిగా పాదయాత్ర కాగా.. న్యాయ్ యాత్ర మాత్రం ఎక్కువగా బస్సుల్లో సాగుతుంది. అక్కడక్కడా పాదయాత్ర ఉంటుందని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.
2024 జనవరి 14న ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో మొదలై 66 రోజులు పాటి సాగి గుజరాత్ లోని మహత్మా గాంధీ పుట్టిన ఊరైన పోరుబందర్ వద్ద మార్చి 30న ముగుస్తుంది. 66 రోజులపాటు 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల మీదుగా దాదాపు 6,713 కిలోమీటర్ల పాటు యాత్ర కొనసాగనుంది. దాదాపు 100 లోక్సభ స్థానాల్లో చేపట్టే ఈ యాత్రలో అన్ని వర్గాల వారితో రాహుల్ గాంధీ మాట్లాడతారు.
భారత్ జోడో న్యాయ యాత్ర ఇలా..
మణిపూర్లోని 4 జిల్లాలు, 2 లోక్సభ, 11 అసెంబ్లీలను కవర్ చేస్తుంది
నాగాలాండ్లో 257 కిలోమీటర్లు, 5 జిల్లాలు 2 రోజుల్లో కవర్ చేయబడతాయి.
అస్సాంలో 833 కిలోమీటర్లు, 17 జిల్లాల్లో 8 రోజుల పాటు సాగుతుంది.
పశ్చిమ బెంగాల్లో 7 జిల్లాలను కవర్ చేస్తూ 5 రోజుల్లో 523 కి.మీ.
జార్ఖండ్లో 8 రోజుల్లో 13 జిల్లాల్లో 804 కి.మీ.
ఒడిశాలో 4 జిల్లాల్లో 4 రోజుల్లో 341 కి.మీ.
బీహార్లో 7 జిల్లాల్లో 4 రోజుల్లో 425 కి.మీ.
యూపీలోని 10 జిల్లాల్లో 11 రోజుల్లో గరిష్టంగా 1074 కి.మీ.
ఛత్తీస్గఢ్లో 7 జిల్లాల్లో 5 రోజుల్లో 436 కి.మీ.
గుజరాత్లో 7 జిల్లాల్లో 5 రోజుల్లో 445 కి.మీ.
రాజస్థాన్లో 2 జిల్లాల్లో ఒకేరోజు 128 కి.మీ.
మహారాష్ట్రలో 7 జిల్లాల్లో 5 రోజుల్లో 480 కి.మీ.