అంబికాపూర్ : ఆదివాసీలు ఎదగడం బీజేపీకి ఇష్టం లేదని, అందుకే వారిని ‘వనవాసీలు’ అని ఆ పార్టీ పిలుస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బుధవారం చత్తీస్గఢ్లో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు.
గిరిజనులు తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించవొద్దని బీజేపీ నేతలు కోరారని రాహుల్ మండిపడ్డారు. ‘‘వనవాసి, ఆదివాసికి మధ్య చాలా తేడా ఉంది. ఆదివాసి అనే పదం.. జల్, జంగల్, జమీన్ లపై మీ హక్కులను తెలియజేస్తుంది. వనవాసి అంటే ‘అడవిలో నివసించే వారు’ అనే అర్థం వస్తుంది” అని ఆయన వివరించారు.