లేఖకు.. రైలు ప్రమాదానికి సంబంధం లేదు

లేఖకు.. రైలు ప్రమాదానికి సంబంధం లేదు

హౌరా సికింద్రాబాద్​ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్​లో అగ్ని ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రయాణికులు అప్రమత్తమై కిందకి దిగడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ ఘటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. సిగరెట్​ తాగడం వల్లే ఆ నిప్పు రవ్వలతో షార్ట్​ సర్క్యూట్​ జరిగి ఇలా అయిందని కొందరు అంటుండగా.. మరి కొందరు ఇటీవలే దక్షిణ మధ్య రైల్వే కి గుర్తు తెలియని వ్యక్తుల లేఖ విషయం ప్రస్తావిస్తున్నారు. 

ALSO READ :రైలు ప్రమాదంతో.. రద్దయిన, మళ్లించిన రైళ్లు ఇవే

అందులో ఢిల్లీ – సికింద్రాబాద్​రైలులో మరో ఒడిశా తరహా ఘటన జరుగుతుందని చెప్పడం.. అది వచ్చిన నాలుగు రోజుల్లోనే ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోంది. అయితే రైల్వే జీఎం అరుణ్​కుమార్​ ఈ విషయంపై స్పందిస్తూ.. ఆ లేఖకు జరిగిన ప్రమాదానికి సంబంధం లేదని తెలిపారు. లేఖ రాసిన వారు ఎవరో కనుక్కునేందుకు దర్యాప్తు జరుగుతున్నట్లు వివరించారు. రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.