రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్. వచ్చే అక్టోబర్ నుంచి ప్రతి రోజు అదనంగా 4 లక్షలకుపైగా బెర్త్లు అందుబాటులోకి రానున్నాయి. రైళ్లలో లైటింగ్, ఎయిర్ కండిషనింగ్ కోసం పవర్ కార్లను వాడకుండా కొత్త టెక్నాలజీతో ఇంజన్ నుంచే పవర్జనరేట్ చేస్తారు. పవర్ కార్ల ప్లేస్లో అదనపు బోగీలు పెట్టడం ద్వారా బెర్త్ల సంఖ్య పెరగనుందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు.
పవర్ కార్స్ ప్లేస్లో బోగీలు
ప్రస్తుతం ప్రతి రైలుకు చివరలో ఒకటో రెండో పవర్ కార్స్ ఉంటాయి. వీటి నుంచి కోచ్లకు ఎలక్ట్రిసిటీ అందుతుంది. ఈ పవర్ కార్స్ డీజిల్ ఇంజన్ ద్వారా నడుస్తాయి. వీటిని ఎండ్ ఆన్ జనరేషన్(ఈవోజీ) అని పిలుస్తారు. నాన్ ఏసీ కోచ్లకు పవర్ అందించేందుకు పవర్ కార్లకు గంటకు 40 లీటర్ల డీజిల్ కావాలి. ఏసీ కోచ్అయితే గంటకు 65- నుంచి 70 లీటర్ల డీజిల్ అవసరం. ఒక లీటర్ డీజిల్ తో మూడు యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. నాన్ ఏసీ కోచ్లకు గంటకు సుమారు 120 యూనిట్ల పవర్ అవసరమవుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హెడ్ ఆన్ జనరేషన్(హెచ్వోజీ) అనే కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. ఈ పద్ధతిలో ఓవర్హెడ్ పవర్ లైన్స్ ద్వారా ట్రైన్ కోచ్లకు పవర్ సప్లై అవుతుంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి 5 వేల కోచ్లు కొత్త టెక్నాలజీతో పనిచేయనున్నాయి. పవర్ కార్లకు గుడ్బై చెప్పి.. అదనపు కోచ్లను అందుబాటులోకి తీసుకురావడమే కాక.. ఈ కొత్త టెక్నాలజీ వల్ల రైల్వేలకు ఏటా పెట్రోల్ బిల్లులపై రూ.6 వేల కోట్లకుపైగా ఆదా కానుంది.
పొల్యూషన్ ఫ్రీ..
కొత్త టెక్నాలజీ పర్యావరణానికి హాని కలిగించనిదని, ఎయిర్, నాయిస్ పొల్యూషన్ ఉండదని, కార్బన్ ఎమిషన్స్ కూడా ఒక ట్రైన్కు ఏడాదికి 700 మెట్రిక్ టన్నులకు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. ‘‘ఉదాహరణకు ప్రతి శతాబ్ది ఎక్స్ప్రెస్చివర డీజిల్తో నడిచే రెండు పవర్ కార్స్ ఉంటాయి. కొత్త సిస్టమ్కు మారితే ఒక పవర్ కార్ సరిపోతుంది. అది కూడా స్టాండ్ బై కోసం. ట్రైన్ లెంగ్త్ పెరగకుండా మరో పవర్ కార్ ప్లేస్లో పాసింజర్ కోచ్ అందుబాటులోకి వస్తుంది. ఇలా మొత్తం పవర్ కార్లను రీప్లేస్ చేసినట్లయితే ప్రతి రోజు 4 లక్షల బెర్త్లు పైగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది” అని రైల్వే శాఖ అధికారి ఒకరు తెలిపారు.