
నైరుతి రుతుపవనాలు మందగించడంతో తెలంగాణ వర్షాల జోరు తగ్గింది. గత రెండు రోజులుగా ఎండలు రోహిణీ కార్తె వేడిని చూపించాయి. వాతావరణం పూర్తిగా మారిపోయిన సమయంలో.. ఆదివారం (జూన్ 1) సాయంత్రం హైదరాబాద్ లో వర్షం ప్రారంభమైంది. ఒక్కసారిగా గాలులతో వాతావరణం చల్లబడి కొన్ని ఏరియాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ ఏరియాల్లో భారీ వర్షం కురుస్తోంది. జీడిమెట్ల, సుచిత్ర, కోంపల్లి, గండిమైసమ్మ, సూరారం, చింతల్, గాజులరామారం వర్షం కురుస్తోంది. ఉన్నట్లుండి వర్షం మొదలవ్వటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. జీడిమెట్ల ఏరియాలో ట్రాఫిక్ జాం అయ్యింది.
ఈ సారి వర్షాకాలానికి ముందే తెలంగాణలోకి నైరుతి రుతపవనాలు విస్తరించడంతో ముందస్తుగా వర్షాలు కరిశాయి. అయితే రుతుపవనాలు ఈశాన్యం వైపుకు కదులుతుండటం, తెలంగాణ ప్రాంతంలో మందగించడంతో గత రెండు రోజులుగా వానలకు కాస్త బ్రేక్ పడింది.
శని (మే 31), ఆది (జూన్ 1) వారాల్లో రెండు రోజులు ఎండ కాస్త గట్టిగానే కొట్టింది. అయితే ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు మొదలై దట్టమైన మేఘాలు విస్తరించి వర్షాలు కురుస్తున్నాయి.