
హైదరాబాద్: ఇవాళ, రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. దీంతో పంట నూర్పిడి చేసిన రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. తూర్పు బీహార్ నుంచి దక్షిణ ఇంటిరియల్ తమిళనాడు వరకు ఆగ్నేయ మధ్యప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ మీదుగా 1.5 కి.మీ ఎత్తుల ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని.. దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, వడగండ్లు పడే అవకాశం ఉందని చెప్పారు. పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున రైతులు చెట్లకింద ఉండవద్దని సూచించారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు.