తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపైనే ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని వల్ల నవంబర్ 11 నుంచి 13 వరకు ఏపీలోని దక్షిణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. అయితే ఈ ప్రభావం తెలంగాణపై లేదని అధికారులు చెబుతున్నారు. తెలంగాణలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఒకటి రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాని చెప్పారు.
ప్రస్తుతం 14 నుంచి 22 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని.. రెండు మూడు రోజుల్లో ఉత్తర తెలంగాణలో 11 నుంచి 15 డిగ్రీల మేర రాత్రిపూట ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
