దేశ దిమ్మరిగా మహేష్.. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ క్రియేట్ చేసిన రాజమౌళి

దేశ దిమ్మరిగా మహేష్..  ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ క్రియేట్ చేసిన రాజమౌళి

ప్రస్తుతం ఇండియా మొత్తం ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(Rajamouli) సినిమా గురించే. ఏ ముహూర్తాన ఈ ప్రాజెక్టు ఒకే అయిందో తెలియదు కానీ, ఈ సినిమాపై అంచనాలు మాములుగా పెరగడం లేదు. రోజు రోజు ఆ అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. దీంతో ఈ ప్రాజెక్టు గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. అంతేకాదు.. ఈ సినిమా కథ ఏంటి? మహేష్ ఎలా కనిపించబోతున్నాడు? అంటూ సెర్చింగ్ మొదలుపెట్టాశారు నెటిజన్స్. 

అదే రేంజ్ లో రూమర్స్ కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. దీంతో ఆడియన్స్, మరీ ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టు నుండి మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో మహేష్ బాబు  దేశ దిమ్మరిగా కనిపించనున్నారట. అంటే.. వీరికి ఒకచోట స్థిర నివాసం ఉండదు.  ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. 

ఆ ప్రయాణంలో అక్కడి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, వారికి హీరో ఎలా సహాయం చేశాడు? అనే కాన్సెప్ట్ తో రానుందట ఈ మూవీ. అయితే ఈ సింపుల్ పాయింట్ భారీ స్కెల్ లో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించబోతున్నాడట జక్కన్న. ఈ నేపధ్యంలో వచ్చే యాక్షన్ అండ్ అడ్వెంచరస్ సీన్స్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాయని టాక్. మరి ఇదే గనక నిజమైతే.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం. మరి ఇప్పుడే ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ కాంబో, రిలీజ్ తరువాత ఇంకెన్ని కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.