Rajamouli, Mahesh babu: త్వరగా ఫినిష్ చేస్తా.. మహేష్ను తీసుకొస్తా.. రాజమౌళి కామెంట్స్ వైరల్

Rajamouli, Mahesh babu: త్వరగా ఫినిష్ చేస్తా.. మహేష్ను తీసుకొస్తా.. రాజమౌళి కామెంట్స్ వైరల్

ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఉన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అంటే రాజమౌళి(Rajamouli), మహేష్ బాబు(Mahesh babu) సినిమా అనే చెప్పాలి. ఈ కాంబోలో సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటినుండి రోజురోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. కారణం ఆర్ఆర్ఆర్ తరువాత రాజమౌళి నుండి రాబోతున్న సినిమా కావడమే. అందుకే ఈ సినిమా కోసం ప్రపంచ సినీ ప్రేమికులు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే చాలా కాలం క్రితమే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకామొదలవలేదు. కానీ, రాజమౌళి ఎక్కడికి వెళ్లినా అదే ప్రశ్న ఆడుగుతున్నారు ఆడియన్స్. 

తాజాగా మరోసారి రాజమౌళికి ఇదే ప్రశ్న ఎదురైంది. కానీ, ఈసారి మాత్రం సాలిడ్ అప్డేట్స్ ఇచ్చాడు రాజమౌళి. ప్రస్తుతం ఆయన జపాన్ లో ఉన్నారు. ఆయన గత చిత్రం ఆర్ఆర్ఆర్ జపాన్ లో సంవత్సన్నర కాలంగా రన్ అవుతూనే ఉంది. ఇందులో భాగంగా మార్చ్ 18న ఆర్ఆర్ఆర్ స్పెషల్ షోస్ వేశారు. ఆ షోకి సంబందించిన టికెట్స్ కూడా క్షణాల్లో అమ్ముడవడం విశేషం. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జపాన్ వెళ్లారు రాజమౌళి.

ఈ సందర్బంగా అక్కడి మీడియాతో ముచ్చటించగా.. వారు రాజమౌళి నెక్స్ట్ సినిమా గురించి ప్రశ్నిచారు. దానికి సమాధానంగా రాజమౌళి మాట్లాడుతూ.. నా తరువాతి సినిమా కథ పూర్తయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్, ప్రీ విజువలైజేషన్ పనులు జరుగుతున్నాయి. ఆ సినిమాలో హీరోగా మహేష్ బాబు చేస్తున్నారు. ఆయన చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. చాలా త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి.. రిలీజ్ టైంలో మహేష్ ను ఇక్కడికి తీసుకొస్తా అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ ఆ ఆ అవుతున్నాయి. ఆ కామెంట్స్ విన్న మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.