- రోడ్ షోలు నిర్వహించిన అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నవంబర్ 23న చివరి రోజు కావడంతో రాష్ట్రంలో బీజేపీ అగ్రనేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా చిత్తోర్గఢ్ జిల్లాలోని నింబహేరా, రాజ్సమంద్ జిల్లాలోని నాథ్ ద్వారాలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షో జైపూర్ నుంచి నింబహేరా వరకు మల్ గోడమ్ రోడ్, నెహ్రు పార్క్, చందన్ చౌక్, బస్టాండ్ మీదుగా దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర కొనసాగింది.
ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థులు శ్రీచంద్ కృపలాని, విశ్వరాజ్ సింగ్ మేవార్కు ఓటేసి గెలిపించాలని ఆయన కోరారు. రోడ్ షోలో బీజేపీ రాజస్థాన్ ప్రెసిడెంట్ సీపీ. జోషి కూడా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జైపూర్లోని జోత్వారా అసెంబ్లీలో ప్రచారంలో పాల్గొన్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే హవా మహల్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు.