
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరుగుతోన్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (52), పడిక్కిల్ 38, అశ్విన్ 30 పరుగులు చేశారు. అయితే మ్యాచ్ చివర్లో హెట్మేయర్(30*) విజృంభించడంతో రాజస్థాన్ భారీ స్కోర్ చేయగలిగింది. ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ జట్టుకు తుషార్ దేశ్పాండే బిగ్ షాక్ ఇచ్చాడు.
రెండో ఓవర్లో నాలుగో బంతికి యశస్వీ జైస్వాల్ (10) మిడాఫ్లో శివమ్ దూబేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అయితే ఆ తరువాత జోస్ బట్లర్, పడిక్కల్ ఇద్దరు దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పెంచారు. 88 పరుగుల వద్ద వీరి జోడిని జడేజా విడదీశాడు. జడేజా వేసిన 8.3 ఓవర్కు డేవాన్ కాన్వేకు క్యాచ్ ఇచ్చి పడిక్కల్ ఔటయ్యాడు.
ఆ తరువాత వచ్చిన సంజూ శాంసన్ (0) కూడా జడేజా బౌలింగ్ లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఆనంతరం బట్లర్, అశ్విన్ కలిసి జట్టును ముందుకు నడిపించారు. వీరిని ఆకాశ్ సింగ్, మొయిన్ అలీ ఔట్ చేశారు. లేకపోయింటే ఇంకా రాజస్థాన్ భారీ స్కోర్ చేసి ఉండేది. చెన్నై బౌలర్లలో ఆకాశ్ సింగ్,జడేజా, తుషార్ రెండేసి వికెట్లు తీయగా, మొయిన్ అలీ ఒక వికెట్ తీశాడు.