
చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టులో గ్లెన్ మ్యాక్స్వెల్ (74), డు ప్లెసిస్ (62) పరుగులతో రాణించారు.
దీంతో బెంగళూరు జట్టు 200 ప్లస్ స్కోర్ ఈజీగా దాటేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ వీరిద్దరూ ఔటయ్యాక దినేశ్ కార్తిక్ (16), మహిపాల్ లోమ్రోర్ (8), హసరంగ (6)విఫలం కావడంతో ఆర్సీబీ 189 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్ లో డకౌట్ అయి విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, సందీప్ చెరో రెండు వికెట్లు తీయగా, చాహల్,అశ్విన్ చెరో వికెట్ తీశారు.