కాంగ్రెస్లో చేరనున్న మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

కాంగ్రెస్లో చేరనున్న మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే

లోక్ సభ ఎన్నికల ముందు గ్రేటర్ లో  బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు.  లేటెస్ట్ గా  రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రేపు( ఏప్రిల్ 20న) రేవంత్ సమక్షంలో ప్రకాశ్ గౌడ్ తన అనుచరులతో కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది.

2024 జనవరి 28న   ప్రకాశ్ గౌడ్ సీఎం రేవంత్ ను కలిశారు. అప్పటి నుంచి ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే తాను  పార్టీ మారడం లేదని.. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కోసమే సీఎంను కలిసినట్లు చెప్పారు. లేటెస్ట్ గా మరోసారి సీఎం రేవంత్ ను కలవడంతో ప్రకాశ్ గౌడ్ చేరిక ఖాయమైనట్లు తెలుస్తోంది. 

 బీఆర్ఎస్ నుంచి  గెలిచిన 39 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటి వరకు ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రావు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.  ప్రకాశ్ గౌడ్ కూడా పార్టీ మారితే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరుతుంది.