మలయాళంలో ఫిబ్రవరి 22న విడుదలైన మంజుమ్మల్ బాయ్స్ (Manjummel Boys). సుమారు రూ.5 కోట్ల బడ్జెట్తో రూపొంది దాదాపు రూ. 200 కోట్లకుపైగా వసూళ్లు సాధించి రికార్డ్ స్పృష్టించింది. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొడువల్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్ కురియన్ ముఖ్య పాత్రల్లో నటించి మెప్పించారు.
తాజాగా ఈ మలయాళీ సూపర్హిట్ ‘మంజుమ్మల్ బాయ్స్’ని సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)స్పెషల్ స్క్రీనింగ్లో చూసారు."ఈ సినిమా తనకెంతో నచ్చడంతో మేకర్స్ అందరినీ ఇంటికి ఆహ్వానించి ప్రశంసించారు.ఇందులో నటీనటుల యాక్టింగ్,మూవీ మేకింగ్ స్టైల్ను మెచ్చుకున్నారు".ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే ఈ మూవీ చూసిన కమల్ హాసన్, సిలంబరసన్, కె భాగ్యరాజ్ మరికొంతమంది ప్రముఖులు మంజుమ్మల్ బాయ్స్ ను..ఈ సస్పెన్స్ థ్రిల్లర్ను అందించిన దర్శకుడు చిదంబరం మేకింగ్ను మెచ్చుకున్నారు.
మంజుమెల్ బాయ్స్ కథ విషయానికి వస్తే..
కొందరు స్నేహితుల అంతా కలిసి తమిళనాడు రాష్ట్రం కొడైకెనాల్లోని గుణ గుహలకు ట్రిప్ కు వెళతారు. ఆ సమయంలో ఆ గ్యాంగ్లోని ఓ యువకుడు అనుకోకుండా ప్రమాదంలో పడతాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో ఆ గ్రూప్లోని స్నేహితులకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యానేదే మంజుమెల్ బాయ్స్ లో ఆద్యంతం థ్రిల్లింగ్గా ఉత్కంఠభరితంగా చూపించారు మేకర్స్.