సూపర్స్టార్ రజినీకాంత్ గురించి తమిళ దర్శకుడు మిస్కిన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. 170కి పైగా సినిమాల్లో నటించిన రజినీకాంత్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారంటూ మిస్కిన్ కామెంట్స్ చేశారు.
లేటెస్ట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటించాలని రజినీకాంత్ ఆసక్తిగా ఉన్నారని, ఆయనే లోకేశ్ ను స్వయంగా ఈ సినిమా గురించి అడిగారన్నారు. బహుశా ఇదే రజనీకాంత్కు చివరి సినిమా కావచ్చు. ఆ తర్వాత ఆయన సినిమాలకు విరాయం తీసుకోబోతున్నారంటూ తెలిపారు.
ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రజినీ అభిమానులు షాక్ అవుతున్నారు. తలైవా ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
రజినీ సినిమాలకు గుడ్బై చెప్పనున్నారనే వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు. బాబా సినిమా నుంచి ఇలాంటి ప్రచారమే నడుస్తోంది. ఆ తరువాత చంద్రముఖి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రజినీ. ఇక కాలా సినిమా టైమ్ లో కూడా ఇలాగే ప్రచారం నడిచింది. కానీ అవి కేవలం రూమార్స్ గానే మిగిలిపోయాయి.
ప్రస్తుతం రజినీ ‘జైలర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో ‘లాల్ సలాం’ అనే చిత్రాన్ని చేస్తున్నారు రజినీ. ఈ సినిమాలో రజినీకాంత్ మొయిద్దీన్ భాయ్గా నటిస్తున్నారు. అనంతరం లోకేశ్ కనకరాజ్తో కూడా ఓ సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజినీ.