సంక్రాంతికి ‘లాల్ సలామ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న రజినీకాంత్.. ప్రస్తుతం తన 170వ చిత్రంలో నటిస్తున్నారు. ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇది సెట్స్పై ఉండగానే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రజినీకాంత్.
విక్రమ్, లియో లాంటి సూపర్ హిట్స్ తర్వాత లోకేష్ డైరెక్ట్ చేయబోతున్న సినిమా కావడంతో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో ఈ కొత్త చిత్రం గురించి ఓ అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ మూవీ ఈవెంట్కు గెస్ట్గా వచ్చిన లోకేష్.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుండి ఈ సినిమా సెట్స్పైకి వెళుతుందని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నట్టు చెప్పాడు. ఈలోపు జ్ఞానవేళ్ సినిమాను కంప్లీట్ చేయనున్నారు రజినీకాంత్.
మరోవైపు అట్లీ దర్శకత్వంలో రజినీకాంత్ నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు అట్లీ. ఇప్పటికే తలైవాకు రెండు, మూడు కథలు చెప్పానని, అయితే ఆయనకు సరిపోయే స్క్రిప్ట్ ఇంకా రెడీ కాలేదన్నాడు. ఆయనతో తీయబోయే చిత్రం ‘భాషా’ను మించేలా ఉండాలని తాను అనుకుంటున్నట్టు చెప్పాడు. తన దర్శకత్వంలో నటించేందుకు రజినీ ఎప్పుడూ రెడీగానే ఉన్నారని చెప్పుకొచ్చాడు అట్లీ.