బాలు త్వరగా కోలుకోవాలి
ట్విట్టర్లో రజనీకాంత్
చెన్నై: ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం త్వరగా కోలుకోవాలని తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆకాంక్షించారు. కొన్నిరోజులుగా కరోనా తో చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో బాలు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. క్రిటికల్ కండిషన్ నుంచి కాస్త కోలుకున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్ సోమవారం వీడియో మెసేజ్ ట్వీట్ చేశారు. ‘ఎస్పీ బాలు సర్ 50 ఏళ్లుగా తన పాటలతో కోట్లాది మందిని అలరించారు. ఇటీవలే ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయన హెల్త్ కండిషన్ నిలకడగా ఉందని తెలిసి సంతోషంగా ఉంది. పూర్తి ఆరోగ్యంగా నార్మల్ స్థితికి వచ్చేందుకు మరికొంత సమయం పట్టవచ్చు. ఆయన ఆరోగ్యంగా ఉండాలి’ అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. అటు బాలు కుమారుడు ఎస్పీ చరణ్ సైతం ఒకటి రెండు రోజుల్లో నాన్న కోలుకుంటారని తెలిపారు.
Get well soon dear Balu sir pic.twitter.com/6Gxmo0tVgS
— Rajinikanth (@rajinikanth) August 17, 2020
For More News..