శివాజీ గణేశన్ మాదిరిగానే రజనీకాంత్ ఓడిపోతారు: ఇళంగోవన్

శివాజీ గణేశన్ మాదిరిగానే రజనీకాంత్ ఓడిపోతారు: ఇళంగోవన్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ పార్టీ మరికొద్ది రోజుల్లో ప్రజల్లోకి రానుంది. ఈ క్రమంలో తమిళనాడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో దిగ్గజ నటుడు శివాజీ గణేశన్ కూడా రాజకీయాల్లో ప్రయత్నించి ఘోర వైఫల్యం చెందాడని.. ఇప్పుడు రజనీకాంత్ కు కూడా పరిస్థితి ఎదురవుతుందని స్పష్టం చేశారు. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఈరోడ్ లో నిరసనల్లో పాల్గొన్న ఇళంగోవన్ మీడియాతో మాట్లాడారు.

అంతేకాదు… ప్రధాని నరేంద్ర మోడీపైనా విమర్శలు చేశారు ఇళంగోవన్. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి బదులు మోడీ గడ్డం రోజురోజుకు పెరుగుతోందంటూ వ్యాఖ్యానించారు. మూడు వ్యవసాయ చట్టాలు తీసుకురావడం ద్వారా కేంద్రం రైతులకు ద్రోహం తలపెట్టిందని ఆరోపించారు. 2021లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదని ఇళంగోవన్ జోస్యం చెప్పారు. తమిళనాడు ప్రజలు బీజేపీని అంగీకరించబోరన్నారు.