మగబిడ్డకు జన్మనిచ్చిన రజినీకాంత్ రెండో కూతురు

మగబిడ్డకు జన్మనిచ్చిన రజినీకాంత్ రెండో కూతురు

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రెండో కూతురు సౌందర్య రజినీకాంత్‌ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే సౌందర్యకి కుమారుడు వేద్‌ కృష్ణ(మొదటి భర్తకి జన్మించిన) ఉండగా.. ఇప్పుడు మరో బిడ్డకు తల్లైంది. ఈ బిడ్డ సౌందర్య, విషగన్‌ వనంగమూడి దంపతుల కుమారుడు. ఇక ఈ పిల్లాడికి `వీర్‌ రజినీకాంత్‌ వనంగమూడి` అనే పేరును పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని  సౌందర్య రజినీకాంత్‌ తెలియజేస్తూ... సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫొటోలను షేర్ చేశారు. `దేవుడి దయ, తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో వేద్‌ కృష్ణ తమ్ముడు వీర్‌ రజనీకాంత్‌ వనంగమూడికి విషగన్‌, వేద్‌, నేను స్వాగతం పలుకుతున్నామనే క్యాప్షన్ ను కూడా ఆమె జతచేశారు. ఈ సందర్భంగా సహకరించిన డాక్టర్లు సుమన మనోహర్‌, డాక్టర్‌ శ్రీ విద్యశేషాద్రిలకు సౌందర్య రజినీకాంత్‌ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా కుమారుడు, భర్తతోపాటు రెండో కుమారుడితో దిగిన ఫోటోలను ట్విట్టర్‌ ద్వారా సౌందర్య పంచుకున్నారు. 

సౌందర్యకి రజనీకాంత్ కు మొదట బిజినెస్‌ మ్యాన్‌ అశ్విన్‌ కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి వేద్‌ కృష్ణ జన్మించారు. కొన్నాళ్లకి అశ్విన్ తో విడిపోయి... 2019లో వ్యాపారవేత్త విషగన్‌ వనంగమూడిని సెకండ్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. తాజాగా వీరికి బాబు వీర్‌ జన్మించడం విశేషం. ఇదిలా ఉండగా సౌందర్య రజనీకాంత్‌ దర్శకురాలిగా రాణిస్తున్నారు. ఆమె మొదట గ్రాఫిక్‌ డిజైనర్‌గా పనిచేశారు. `పడయప్ప`, `బాబా`, `చంద్రముఖి`, `అన్బే ఆరుయిరే`, `శివకాశి`, `మజా`, `పందెంకోడి`, `చెన్నై600028`, `శివాజీ` చిత్రాలకు గ్రాఫిక్‌ డిజైనర్‌గా పనిచేశారు. `కథానాయకుడు` చిత్రంలో గెస్ట్ రోల్‌లోనూ సౌందర్య అలరించారు. `గోవా` చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన సౌందర్య... మరోవైపు రజనీకాంత్‌తో యానిమేషన్‌ మూవీ `కొచ్చడయాన్‌` చిత్రానికి దర్శకత్వం వహించారు. దీంతోపాటు ధనుష్‌తో `వీఐపీ2` సినిమాని తెరకెక్కించారు.