ఇద్దరు పిల్లలతో కష్టాలు పడుతున్న.. ఏదైనా ఉపాధి కల్పించండి

ఇద్దరు పిల్లలతో కష్టాలు పడుతున్న.. ఏదైనా ఉపాధి కల్పించండి

ఇటీవల ఓయూలో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి రవీంద్ర నాయక్ భార్య రజిత ఆమె  పిల్లలు బీజేపీ నిరుద్యోగ దీక్షలో పాల్గొన్నారు. తన భర్త తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడన్నారు.   పీహెచ్ డీ చేసిన తన భర్త ఉద్యోగం రాలేదనే ఆవేదనతో ఆత్మ హత్య చేసుకున్నాడన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నోటిఫికేషన్ లు జారీ చేయాలని కోరారు. తనకు వచ్చిన కష్టాలు మరొకరికి రావొద్దంటూ ఆవేదన చెందారు.  ఆత్మ హత్య చేసుకున్నప్పుడు అన్ని పార్టీల నాయకులు  వచ్చి ఉపాధి కల్పిస్తామన్నారు..కానీ ఇంత వరకు ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇద్దరు పిల్లలతో కష్టాలు పడుతున్నానని.. ఏదైనా ఉపాధి కల్పించాలని కోరారు. ఉపాధి కల్పిస్తే తన పిల్లలను పోషిస్తానన్నారు.