సభలో అంత ఇబ్బంది ఉంటే బయటకెళ్లి రండి

సభలో అంత ఇబ్బంది ఉంటే బయటకెళ్లి రండి

సభలో ఉన్నంత సేపు సభ్యులు మాస్క్ పెట్టుకోవాలన్నారు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. సభలో కొంతమంది సభ్యులు ముఖం నుంచి మాస్కును కిందకు తీస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని..ఇబ్బందిగా ఉంటే కాసేపు బయటకు వెళ్లి రావాలని సూచించారు.కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో సమావేశాలు జరుగుతున్నాయన్నారు. సభ్యులంతా కోవిడ్ 19 ప్రోటోకాల్ పాటించాలన్నారు.  సభలో సభ్యులు కూర్చుని మాట్లాడాలన్నారు. సభ్యులు పరిమిత సమయంలోనే సభకు విషయాన్ని తెలియజేయాలన్నారు. సాధారణ పరిస్థితుల్లో సభ జరిగినప్పుడు అన్ని విషయాలు సభ దృష్టికి తీసుకురావొచ్చన్నారు.

రాష్ట్రంలో ఇంకా బానిసత్వ పాలన

దేశంలో ఒక్కరోజే 97 వేల కేసులు..6 కోట్లు దాటిన టెస్టులు