కేంద్ర మాజీ మంత్రి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ మృతికి రాజ్యసభ సంతాపం తెలిపింది. సుష్మ మృతికి నివాళిగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. దేశానికి సుష్మా స్వరాజ్ చేసిన సేవలను కొనియాడారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. 25 ఏళ్ల వయసులోనే సుష్మ మంత్రి అయ్యారని చెప్పారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. కేంద్ర మంత్రిగా అంతర్జాతీయంగా భారత ఖ్యాతిని సుష్మ స్వరాజ్ పెంచారన్నారు. సుష్మ స్వరాజ్ మృతి తనకు వ్యక్తిగతంగా తీరని లోటన్నారు వెంకయ్య నాయుడు.
Rajya Sabha Chairman M Venkaiah Naidu and members of the House pay tribute to former EAM Sushma Swaraj. M Venkaiah Naidu says, "In her untimely demise, the nation has lost an able administrator, an effective parliamentarian and a true voice of people." pic.twitter.com/Z8AFGxtop9
— ANI (@ANI) August 7, 2019