- కోటగండి మైసమ్మ ఆలయంలోకి మందు బాటిల్తో వెళ్లిన వర్మ
హనుమకొండ, వెలుగు: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీరు మరోసారి వివాదాస్పదమైంది. కొండా మురళి బయో పిక్ షూటింగ్ కోసం మంగళవారం వరంగల్ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరికి వచ్చిన వర్మ అక్కడి కోటగండి మైసమ్మ ఆలయాన్ని సందర్శించారు. మద్యం బాటిల్ తో గర్భ గుడిలోకి వెళ్లి అమ్మవారి విగ్రహానికి విస్కీ తాగించినట్లు ఫొటోలు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘నేను కేవలం వోడ్కా నే తాగుతా. కానీ మైసమ్మ దేవతకు విస్కీ తాగించా’ అని ట్వీట్ చేశారు.
CHEERS! ??? pic.twitter.com/WXDMdZ4PcC
— Ram Gopal Varma (@RGVzoomin) October 12, 2021