రామయ్య హుండీ ఆదాయం రూ.1.81 కోట్లు

రామయ్య హుండీ ఆదాయం రూ.1.81 కోట్లు

భద్రాచలం,వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థాన హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 56 రోజులకు రూ.1,81,80,925 ఆదాయం వచ్చిందని ఈవో ఎల్.రమాదేవి తెలిపారు.

ఇందులో అన్నదాన సత్రంలోని హుండీ ద్వారా రూ.3,88,100, బంగారం 174 గ్రాములు, వెండి కిలో 248 గ్రాములు, 1115 యూఎస్​ డాలర్లు, వెయ్యి సౌతాఫ్రికా రాండ్స్, 90 కెనడా డాలర్లు, 145 ఆస్ట్రేలియా డాలర్లు, 17 మలేషియా రింగిట్స్, 25 ఇంగ్లాండ్​  పౌండ్స్​, 6  సౌదీ అరేబియా రియాల్స్,100 జపాన్ ​యేన్స్, 20 థాయిలాండ్ బాత్​లు, 15 నేపాల్​ రూపీలు, 15 యూఏఈ థీరమ్స్, 6 ఖతార్​ రియాన్స్, 100 ఒమాన్​ బైసా,10 బంగ్లాదేశ్​టాకాలు వచ్చాయని చెప్పారు. నగదు, విదేశీ కరెన్సీని బ్యాంకులో జమ చేశామన్నారు.