
రాంనగర్ ఫిష్ మార్కెట్ ఆదివారం సందడిగా కనిపించింది. మృగశిర కార్తె తొలిరోజు చేపలు తింటే ఆరోగ్యం బాగుంటుందన్న నమ్మకంతో ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి, చేపలు కొనుగోలు చేశారు. వ్యాపారులు కూడా అధిక ధరలకు విక్రయించకుండా సాధారణ రోజుల్లో కిలోకు ఉన్న రేటుకు అదనంగా రూ.20 వసూలు చేశారు. - ట్యాంక్ బండ్, వెలుగు