
సినీ నటులు నరేశ్, పవిత్రల వివాదం రోజురోజుకు ముదురుతోంది. కర్ణాటకలోని మైసూరులోని ఓ హోటల్ లో నరేశ్, పవిత్రలు కలిసి బస చేస్తున్నారని తెలుసుకున్న నరేష్ మూడో భార్య రమ్య వారిని పట్టించేందుకు పోలీసులతో అక్కడికి వెళ్లింది. అక్కడ వారితో వాగ్వాదానికి దిగింది. ఈ క్రమంలో పవిత్రను రమ్యను చెప్పుతో కొట్టబోయింది. దీంతో అక్కడున్నవారు రమ్యను అడ్డుకున్నారు. ఇదంతా జరుగుతున్న టైమ్ లో నరేశ్, పవిత్రలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇంతకి ఏం జరిగింది?
నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి. వీరిద్దిరి మధ్య విభేదాలు రావడంతో గతకొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో పవిత్రా లోకేశ్ను నరేష్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. వాటిపైన రమ్య స్పందిస్తూ.. తనకు విడాకులు ఇవ్వకుండా వాళ్లిద్దరూ ఎలా పెళ్లి చేసుకుంటారని, ఇది చట్టరీత్యా నేరమంటూ పలు ప్రెస్మీట్లలో చెప్పుకొచ్చింది. అయితే రమ్య చేసే కామెంట్స్ కేవలం ఆరోపణలు మాత్రమేనని, డబ్బు కోసమే బ్లాక్ మెయిల్ చేస్తోందని నరేష్ అంటున్నారు. అటు నరేష్ కు తనకు మధ్య మంచి అనుబంధం ఉందని, పాపులారిటీ కోసం రమ్య ఇలాంటి ఆరోపణలు చేస్తోందని పవిత్ర తెలిపింది.