"బ్రహ్మాస్త్ర" మూవీ కోసం రక్తం, చెమట ధారపోశాం

"బ్రహ్మాస్త్ర" మూవీ కోసం రక్తం, చెమట ధారపోశాం

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, హీరోయిన్ ఆలియా భట్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ మూవీలో స్టార్ బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు కూడా ఉండడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు నమోదవుతున్నాయి. బిగ్ బి అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నాగార్జున లాంటి బిగ్గెస్ట్ స్టార్స్ కూడా ఈ మూవీలో ఇన్వాల్వ్ కావడంతో విడుదల కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే రణ్ బీర్ కపూర్, అమితాబ్ బచ్చన్, నాగార్జునల ఫస్ట్ రిలీజ్ చేయగా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బ్రహ్మాస్త్ర ట్రైలర్.. నేడు విడుదల కానుండడంతో రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ లు ఓ వీడియో ద్వారా తమ సందేశాన్ని చేరవేశారు. 

బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ  ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో చూస్తున్నారని తనకు తెలుసన్న రణ్ బీర్.. ఆడియెన్స్ ఇచ్చే రెస్పాన్స్ కోసం తాను చాలా వెయిట్ చేస్తున్నానని అన్నారు. మళ్లీ తనకు బ్రహ్మాస్త్రలో నటించే అవకాశం వస్తుందో, రాదో తెలియదు గానీ.. ఈ మూవీ కోసం రక్తం, చెమట, గుండె, ఆత్మ, లివర్, కిడ్నీ అన్నీ ధారపోశామని తెలిపారు. ప్రతీ ఒక్కరికీ ఈ ట్రైలర్ నచ్చుతుందని ఆశిస్తు్న్నట్టు రణ్ బీర్ చెప్పుకొచ్చారు.

ఇదే తరహాలో బాలీవుడ్ నటి ఆలియా భట్ కూడా ఓ వీడియోను షేర్ చేసి.. తన ఎమోషన్ ను పంచుకున్నారు. ఇప్పటివరకూ ట్రైలర్ ను 25-30 సార్లు చూశానన్న ఆలియా.. ఒక వారం నుంచి తనకు సరిగా నిద్ర కూడా పట్టడం లేదని అన్నారు. కానీ ఈ సినిమా పట్ల తానేమీ నెర్వస్ గా లేనని తెలిపారు. ఇది తనకు చాలా పెద్ద విషయమని.. ఎందుకంటే ఇది కేవలం సినిమా మాత్రమే కాదని చెప్పారు. ప్రపంచాన్నంతటినీ దాటుకొని ఈ మూవీపై ఎఫర్ట్ పెట్టామని.. ఈ ట్రైలర్ రిలీజ్ అవుతున్నందుకు టీం అంతా ఎంతో ఎక్సైటింగ్ గా ఉన్నామని ఆలియా తెలిపారు.