
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, వాణి కపూర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం 'షంషేరా'. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను జూలై 22వ తేదీన రిలీజ్ చేయనున్నారు. కరణ్ మల్హోత్రా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ టీజర్ ను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ను శుక్రవారం రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ తేదీని ప్రకటిస్తూ టీజర్ వదిలారు చిత్ర బృందం. హీరో ఓ ట్రైబల్ తెగకు చెందినవాడిగా కనిపిస్తాడు. ఇందులో తన తెగ ప్రజలను కాపాడుకునేందుకు రణ్బీర్ బీకర యుద్దం చేస్తాడు. ఈ మూవీలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలను అమంతం పెంచేసింది. ఇక ఈ మూవీ ట్రైలర్ను హిందీ, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నారు.