బాలికపై అత్యాచారం కేసులో యువకుడికి 20 ఏండ్ల జైలు

బాలికపై అత్యాచారం కేసులో యువకుడికి 20 ఏండ్ల జైలు
  • శిక్ష విధించిన రంగారెడ్డి జిల్లా కోర్టు

ఎల్ బీనగర్, వెలుగు: బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ ఎల్ బీనగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పునిచ్చింది. ఇబ్రహీంపట్నం ఏసీపీ ఏఎస్ రావు  తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండలం దాతపల్లి గ్రామానికి చెందిన సపావత్ అంజిత్ కుమార్(28) ఆరేండ్ల కిందట ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో మంచాల పోలీసులు అతడిని అరెస్ట్ చేసి పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.

పూర్తి స్థాయిలో విచారణ జరిపి సాక్ష్యాలను రంగారెడ్డి జిల్లా కోర్టులో సమర్పించారు. సోమవారం కేసు విచారణలో భాగంగా అంజిత్ కుమార్ కు 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నేరస్తుడికి శిక్షపడేలా చేసిన మంచాల సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ ను రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ అభినందించారు.