పీకలదాకా తాగి రోడ్డుపై హల్ చల్..కత్తితో బెదిరింపులు

పీకలదాకా తాగి రోడ్డుపై హల్ చల్..కత్తితో బెదిరింపులు

రంగారెడ్డి జిల్లాలో మద్యం మత్తులో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. అతడిని అడ్డుకోబోయిన వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. 

రాజేంద్రనగర్ అత్తాపూర్ లో మన్ ప్రీత్ సింగ్ అనే యువకుడు మద్యం సేవించి గురుద్వార్ కు వెళ్లాడు. దీంతో మద్యం సేవించి వచ్చాడని.. అతడిని గురుద్వార్ నుంచి బయటకు పంపించారు. ఆగ్రహానికి గురైన మన్ ప్రీత్ సింగ్ రోడ్డుపై హల్ చల్ చేశాడు. అతడిని అడ్డుకోబోయిన వారిపై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.