విద్యార్థులను కరిచిన ఎలుకలు

విద్యార్థులను కరిచిన ఎలుకలు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని చటాన్ పల్లి గురుకుల పాఠశాలలో ఎలుకలు కలకలం సృష్టించాయి. హాస్టల్ లో నిద్రిస్తున్న తొమ్మిది మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. విద్యార్థులను షాద్ నగర్ ప్రభుత్వ ఆసుప్రతికి తరలించి వైద్యం అందించారు. పిల్లల తల్లిదండ్రులు తెచ్చి ఇచ్చిన స్నాక్స్ వల్లే హాస్టల్ లోకి ఎలుకలు వచ్చాయని టీచర్లు చెపుతున్నారు.  చటాన్ పల్లి శివారులో  కేశంపేట, దౌల్తాబాద్ కు చెందిన గురుకుల కేంద్రంలో 850 మంది విద్యార్థులు చదువుతున్నారు. తొమ్మిది మంది విద్యార్థులకు ఎలుకలు కరవడంతో మిగతా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.