మోడీ స్టేడియంలో మోత మోగింది: కొత్త స్టేడియంలో భారత్ గ్రేట్ విక్టరీ

మోడీ స్టేడియంలో మోత మోగింది: కొత్త స్టేడియంలో భారత్ గ్రేట్ విక్టరీ

అహ్మదాబాద్: మోడీ స్టేడియంలో మోత మోగిపోయింది. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లండ్ ఘోర పరాజయం చవిచూసింది. రెండు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫస్ట్ నుంచీ ఆధిపత్యం చెలాయించింది. స్పిన్‌ కు అనుకూలిస్తున్న పిచ్‌ పై మన స్పిన్నర్లు విజృంభించడంతో ఇంగ్లండ్‌ కు దారుణ ఓటమి తప్పలేదు. ఒక పక్క నుంచి అక్షర్ పటేల్, మరో పక్క నుంచి అశ్విన్ ఇంగ్లీష్ బ్యాట్స్‌ మెన్‌ ను తిప్పేశారు.

దీంతో సిరీస్‌ లో టీమిండియా 2-1తో లీడ్ సాధించింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 112 రన్స్ కు కుప్ప కూలిన ఇంగ్లండ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 81 పరుగులకే ఆలౌటైంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆధిక్యం తీసేయగా ఇంగ్లండ్ జస్ట్ 48 పరుగులు మాత్రమే లీడ్ సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 49 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 7.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కొత్త స్టేడియంలో 10 వికెట్లతో విక్టరీ కొట్టి పరువు నిలబెట్టుకుంది కోహ్లీసేన.