దేవాలయం భూమికి ఎసరు పెట్టిన రియల్ ఎస్టేట్ సంస్థ

దేవాలయం భూమికి ఎసరు పెట్టిన రియల్ ఎస్టేట్ సంస్థ

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో మరోసారి రియల్ మాఫియా బరితెగించింది. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని పురాతన పోచారం గుట్ట దేవాలయం భూమికి ఎసరు పెట్టింది ఓ రియల్ ఎస్టేట్ సంస్థ. కొద్దిరోజుల క్రితం గుడి స్థలాన్ని మట్టితో చదును చేసి రాత్రికి రాత్రే ఏకంగా కంటైనర్లు తెచ్చి పెట్టారు రియాల్టర్లు. గతంలో పోచారం గుట్ట దేవాలయం భూమిని పరిశీలించిన దేవాదాయశాఖ ఈవో చంద్రా రెడ్డి.. దేవాలయ స్థలంపై ఫిర్యాదు అందుకున్నారు.

కాగా, ఈ స్థలంలో అర్ధరాత్రి అదును చూసి కంటైనర్లు తెచ్చి పెట్టిన రియల్ మాఫియా అక్రమణకు పాల్పడింది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని భూముల రెట్లకు రెక్కలు రావడంతో ఏకంగా దేవుడికే శఠగోపం పెట్టేందుకు ప్లాన్ వేసింది రియల్ ఎస్టేట్ సంస్థ. దీంతో ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికుల డిమాండ్ చేస్తున్నారు.