తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం

తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. ఎప్పుడు లేని విధంగా ఒక్కరోజే హుండీ ద్వారా రూ. 7.68 కోట్ల కానుకలను భక్తులు సమర్పించినట్లు టిటిడి వెల్లడించింది. ఒకేరోజు ఇంత పెద్ద మొత్తంలో హుండీ ద్వారా కానుకలు రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. 2022 అక్టోబర్ 23న వచ్చిన రూ.6.31 కోట్ల ఆదాయమే ఇప్పటివరకు వచ్చిన అత్యధిక హుండీ ఆదాయం. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం శ్రీవారిని 69,414 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 18,612 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇక ఈ నెల 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుండడంతో భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. ఈ నెల 28న శ్రీవారి రథసప్తమి వేడుక వైభవంగా జరగనుంది.  ఒకే రోజున శ్రీవారు సప్తవాహనాలపై  ఊరేగనున్నారు.